Friday, March 29, 2024

రాహుల్‌జీ ఇప్పటికైనా కళ్లు తెరవండి

- Advertisement -
- Advertisement -
BJP Chief JP Nadda comment on rahul gandhi
బిజెపి జాతీయాధ్యక్షుడు నడ్డా సెటైర్లు

న్యూఢిల్లీ: భారత ఆర్మీ, ప్రభుత్వం, ప్రజలపట్ల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా హితవు పలికారు. రాహుల్ ఎంతగానో విశ్వసించే దేశమైన పాకిస్థాన్‌కు చెందిన నేత మాటలైనా ఆయన కళ్లు తెరిపిస్తాయని ఆశిస్తున్నారన్నారు. ఇకనైనా భారత ఆర్మీని తక్కువ చేసి మాట్లాడేరాజకీయాలకు స్వస్తి చెప్పాలన్నారు. కాగా పాక్ ప్రతిపక్ష నేత అయాజ్ సాదిఖ్ బుధవారం అక్కడి జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ అభినందన్ వర్ధమాన్ విడుదల నాటి పరిస్థితులను గుర్తు చేసిన విషయం తెలిసిందే. విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి ప్రతిపక్షాలు కూడా హాజరయ్యాయని, ఆ సమయంలో అభినందన్‌ను విడుదల చేయడం తప్ప తమకు వేరే మార్గం లేదని మంత్రి చెప్పారని సాదిఖ్ పేర్కొన్నారు.

అదేవిధంగా భారత్ ప్రతీకార దాడికి సిద్ధమవుతోందని, వెంటనే వింగ్ కమాండర్‌ను విడుదల చేయాలని చెప్పారని, ఆ సమయంలో అక్కడే ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్వా వణికి పోయారని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన నడ్డా,‘మన దేశ ఆర్మీని తక్కువ చేసి చూపించడమే లక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి తెరతీసింది. సాయుధ దళాలను, వారి ధైర్యసాహసాలను విమర్శించే విధంగా మాట్లాడింది. అంతేకాదు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌లో ల్యాండ్ కాలేవంటే ప్రచారం చేసింది. ఇలాంటి ప్రచారాలను భారత ప్రజలు తిప్పికొట్టారు. ఓటమి రూపంలో వారికి శిక్ష విధించారు. భారతీయులను, భారత ఆర్మీని, ప్రభుత్వాన్ని నమ్మని కాంగ్రెస్ పార్టీ వారికి ఎంతో విశ్వాసపాత్రమైన పాక్ వల్లనైనా కళ్లు తెరుస్తుదేమో. ఇప్పటికైనా రాహుల్‌జీ కాస్త కళ్లు తెరవండి’ అంటూ చురకలు అంటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News