Wednesday, April 24, 2024

గవర్నర్‌తో బిజెపి కార్పోరేటర్ల భేటీ..

- Advertisement -
- Advertisement -

గవర్నర్‌తో బిజెపి కార్పోరేటర్ల భేటీ
జిహెచ్‌ఎంసి కౌన్సిల్ సమావేశం ఏర్పాటుపై వినతిపత్రం సమర్పణ
మన తెలంగాణ/హైదరాబాద్: జిహెచ్‌ఎంసి కౌన్సిల్ సమావేశం ఏర్పాటుపై బిజెపి కార్పోరేటర్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు మంగళ వారం వినతిపత్రం సమర్పించారు.ఇటీవల జరిగిన జిహెచ్‌ఎంసి సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడడంపై బిజెపి కార్పోరేటర్లు అసంతృ ప్తిని వ్యక్తం చేశారు. వెంటనే జిహెచ్‌ఎంసి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని బిజెపి కార్పోరేటర్లు గవర్నర్ కు సమర్పించిన వినతిపత్రంలో కోరారు. జిహెచ్‌ఎంసి సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలను బిజెపి కార్పోరేటర్లు గవర్నర్ కు విన్నవించారు.

ఈ నెల 3వ తేదీన జిహెచ్‌ఎంసి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. ఈ సమావేశానికి బిజెపి కార్పోరేటర్లు వినూత్న వేషధారణతో హాజరయ్యారు. సమావేశంలో అధికారులపై బిజెపి కార్పోరేటర్లు అనుచిత వ్యాఖ్యలు చేశారని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆరోపించారు. బిజెపి కార్పోరేటర్లు వ్యవహరించిన తీరుపై అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. జిహెచ్‌ఎంసి కౌన్సిల్ సమావేశాన్ని జలమండలి అధికారులు, జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్లు బహిష్కరించారు.

దీంతో సమావేశం అర్ధాంత రంగా వాయిదా పడింది. జిహెచ్‌ఎంసి కౌన్సిల్ సమావేశం వాయిదా పడిన తర్వాత కూడా కార్యాలయం ముందు బిజెపి, కాంగ్రెస్ కార్పో రేటర్లు ఆందోళనకు దిగారు. జిహెచ్‌ఎంసి కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలు చర్చకు వస్తాయని భయపడి సమావేశం జరగకుండా అధికార బిఆర్‌ఎస్ అడ్డుపడిందని బిజెపి కార్పోరేటర్లు ఆరోపించారు. హైద్రాబాద్ నగర వాసుల సమస్యలను చర్చించి వాటికి పరిష్కారం చూపేం దుకు జిహెచ్‌ఎంసి కౌన్సిల్ సమావేశాన్నినిర్వహించేలా చర్యలు తీసుకోవాలని బిజెపి కార్పోరేటర్లు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News