Thursday, April 25, 2024

అందుకే బిజెపికి ఓట్లు అడిగే హక్కులేదు: కడియం

- Advertisement -
- Advertisement -

BJP has no right to vote

జనగామ: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బిజెపికి పట్టభద్రులు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఎంఎల్‌సి కడియం శ్రీహరి తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను శ్రీహరి అభ్యర్థించారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్లలో పట్టభద్రులతో ఎంఎల్‌సి కడియం శ్రీహరి సన్నాహక సమావేశంలో మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏడేండ్లలో తెలంగాణలో ఎన్నడూ లేని అభివృద్ధి జరిగిందన్నారు. రెండు కోట్ల ఉద్యోగులు కల్పిస్తానన్న బిజెపి ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ఒక్కరికైనా నియామక పత్రం ఇచ్చిందా? అని ప్రశ్నించారు. మేధావులైన పట్టభద్రులు టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి అభ్యర్థి పల్లారాజేశ్వర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News