Thursday, March 28, 2024

బిజెపికి అధికారం ఇస్తే ఉత్తరాది వాళ్ల చేతుల్లోకి తెలంగాణ: గుత్తా

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: బిజెపి తెలంగాణకు అత్యంత ప్రమాదకారిగా మారిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ తెలిపారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పొరపాటున బిజెపికి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్నీ కోల్పోతారని చెప్పారు. తెలంగాణపై బిజెపి కక్ష్య పెంచుకుందని మండిపడ్డారు. ఢిల్లీ నుంచి వచ్చే దూతలు ఇక్కడి బిజెపి నాయకులను ఆడిస్తున్నారని, వారు చెప్పిన విధంగా తెలంగాణ బిజెపి నేతలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిని చూసి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఓర్వలేక పోతుందన్నారు.

మునుగోడు ఉప ఎన్నిక రాజగోపాల్ రెడ్డి అహంకారం వల్లే వచ్చిందని, బిజెపి చేతిలో పావుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మారాడని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంమే తెలంగాణకు శ్రీరామరక్ష అని సుఖేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాకముందు ప్రజలు ఆంధ్ర నాయకుల చెప్పు చేతుల్లో మగ్గిపోయారని, బిజెపికి అధికారం ఇస్తే ఉత్తరాది నాయకుల చెప్పు చేతుల్లోకి తెలంగాణ పోతుందని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకాన్ని బిజెపి నిర్వీర్యం చేసిందని గుత్తా ధ్వజమెత్తారు. బిజెపికి అధికార యావ తప్ప ప్రజలపై ప్రేమ లేదని, తెలంగాణ ప్రజలు తెలివితో తీర్పు ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించే ప్రజా దీవెన సభను సక్సెస్ చేయాలని గుత్తా పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News