Tuesday, April 23, 2024

బిజెపికి భారీ షాక్‌.. సొంత‌గూటికి చేరిన‌ ముకుల్ రాయ్

- Advertisement -
- Advertisement -

BJP leader Mukul Roy rejoins TMC

కోల్‌క‌తా: బెంగాల్‌లో బిజెపికి భారీ షాక్ త‌గిలింది. బిజెపి ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ సొంతగూటికి చేరుకున్నారు. తృణ‌మూల్ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ సమక్షంలో ముకుల్ రాయ్ పార్టీలో చేరారు. ముకుల్ తో పాటు ఆయన కుమారుడు సుభ్రాంశురాయ్ టిఎంసిలో చేరారు. వారం రోజులుగా కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు శుక్రవారం తెర‌ప‌డింది. ముకుల్ రాయ్ ఎప్పుడూ టిఎంసికి వ్యతిరేకంగా మాట్లాడలేదని మమత పేర్కొన్నారు. టిఎంసి ఎలాంటి కుంభకోణాలు చేయలేదన్నారు. భాజపా ఎందుకు బీటలు వారుతోందో వారినే అడగండని ఆమె తెలిపారు. ఇత‌రుల‌ మాద‌రిగా ముకుల్ రాయ్ దేశ‌ద్రోహి కాద‌ని ఆమె నొక్కిచెప్పారు. 2017లో తృణ‌మూల్‌ను వీడారు.

BJP leader Mukul Roy rejoins TMC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News