Saturday, April 20, 2024

ఈటలను పరామర్శించిన రఘునందన్, రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

BJP leaders consult with etela rajender

మనతెలంగాణ/హైదరాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రలో అస్వస్థతకు గురైన బిజెపి నేత ఈటల రాజేందర్‌ను బిజెపి ఎంఎల్‌ఎలు రాజాసింగ్, రాఘునందర్‌రావులు ఆదివారం నాడు పరామర్శించారు. ఈక్రమంలో ఈటల ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో ఆరోగ్యం క్షీణించడంతో ఈటల వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. పాదయాత్ర ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు ఈటల ప్రకటించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈటలను ఇప్పటికే పలువురు నేతలు పరామర్శించారు. ఈటలను పరామర్శించిన తర్వాత మీడియాకు ఎంఎల్‌ఎలు రాజాసింగ్, రఘునందన్‌లు మీడియాతో మాట్లాడుతూ ఈటల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, సోమవారం నాడు ఈటల డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకొని తిరిగి ఈటల తన పాదయాత్రను ప్రారంభిస్తారని వెల్లడించారు. ప్రజల ఆశీర్వాదంతో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మళ్లీ ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News