Friday, March 29, 2024

యువకులే.. టిఆర్‌ఎస్ సైనికులు

- Advertisement -
- Advertisement -

BJP Leaders Joined TRS Party in Siddipet

సిద్దిపేట: టిఆర్‌ఎస్ పార్టీకి యువకులే సైనికులని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంత్రి సమక్షంలో సిద్దిపేట పట్టణం 6వ వార్డు కౌన్సిలర్ సాకి బాల్‌లక్ష్మీ ఆనంద్ ఆధ్వర్యంలో పలువురు యువతతో పాటు ఇమాంబాద్ గ్రామానికి చెందిన బిజెపి నాయకులు టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి చేరవేయడంతో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో యువత ఉద్యోగుల ఉపాధి కల్పన దిశగా ఐటిటవర్ రాబోతుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి సొంత ఖర్చులతో కోచింగ్ సెంటర్లు, పెట్టి ఎంతోమంది కుటుంబాల్లో వెలుగులు నింపామని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. సిద్దిపేట విద్యాక్షేత్రం, పర్యాటక క్షేత్రం, క్రీడా హబ్‌గా ఎంతో అభివృద్ధి చేసుకుంటన్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, సిద్దిపేట పట్టణ పార్టీ అధ్యక్షులు కొండం సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News