Wednesday, April 24, 2024

హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాల్లో బిజెపి జోరు..

- Advertisement -
- Advertisement -

BJP Leads in 5th round in Huzurabad by poll

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బిజెపి 344 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్ లో బిజెపికి 4358 ఓట్లు, టిఆర్ఎస్ కు 4014 ఓట్లు వచ్చాయి. దీంతో 5 రౌండ్లతో కలిపి బిజెపికి 22,327 ఓట్లు, టిఆర్ఎస్ కు 20,158 ఓట్లు వచ్చాయి. 5 రౌండ్ల తర్వాత బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ 2169 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కాగా, ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు, 14 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 22 రౌండ్ల‌లో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగియ‌నుంది. సాయంత్రం వరకు పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి.

BJP Leads in 5th round in Huzurabad by poll

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News