Friday, March 29, 2024

బిజెపి ఎంఎల్ఎ కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

 

భోపాల్: మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ఎంఎల్ఎ మనోహర్ ఉన్‌త్వాల్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. గతకొంతకాలంగా మెదడు రక్తస్రావంతో బాధపడుతున్న ఉన్‌త్వాల్‌ ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించారు. ఆయన మరణ వార్త విని బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు షాక్ గురయ్యారు. దీంతో భోపాల్ లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుంటున్నారు.

కాగా, 2014 పార్లమెంటు ఎన్నికలలో దేవాస్ నియోజకవర్గం నుండి గెలుపొందిన మనోహర్ ఉన్‌త్వాల్‌.. 2018లో జరిగిన మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అగర్ నియోజకవర్గం నుంచి ఎంఎల్ఎగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో మనోహర్‌ ఉన్‌త్వాల్‌ లోక్‌సభకు రాజీనామా చేసి అగర్ ఎంఎల్ఎగా కొనసాగుతున్నారు.

BJP MLA Manohar Untwal passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News