- Advertisement -
హైదరాబాద్: సిద్దిపేటలో దళిత ఎంఎల్ఎ క్రాంతి కిరణ్, మాజీ ఎంఎల్ఎ వేముల వీరేశంపై బిజెపి గుండాల దాడి చేశారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్లో బస చేసిన ఎంఎల్ క్రాంతి కిరణ్, వేముల వీరేశం రూమ్లో భోజనం చేస్తుండగా బిజెపి గుండాలు దాడి చేశారు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన టిఆర్ఎస్ కార్యకర్త చేతికి గాయం తగిలింది. ఇదే ఉద్దేశపూర్వక దాడి అని ఎంఎల్ఎ క్రాంతికిరణ్ మండిపడ్డారు. ఒక దళిత ఎంఎల్ఎనైన తనపై దాడి చేయడం బిజెపి నైజాన్ని బయటపెట్టిందన్నారు. తొగుట మండలంలో తాను ఇంచార్జ్గా వ్యవహరించినందుకు అక్కసుతోనే దాడి చేశారని క్రాంతి మండిపడ్డారు.
- Advertisement -