Thursday, April 25, 2024

నిఖత్ జరీన్‌ను సత్కరించిన బిఒఐ

- Advertisement -
- Advertisement -

BOI honors Nikhat Zareen

 

మన తెలంగాణ/ హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ జోన్ అధికారి, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అయిన కుమారి నిఖత్ జరీన్‌ను సోమవారం పిటిఐ బిల్డింగ్‌లోని బ్యాంక్ జోనల్ కార్యాలయంలో సత్కరించింది. టర్కీలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ టోర్నమెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న తర్వాత జోనల్ కార్యాలయాన్ని ఆమె తొలిసారిగా సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఎన్‌బిజి సౌత్2 జనరల్ మేనేజర్ వివేకానంద్ దూబే, తెలంగాణ జోన్ జోనల్ మేనేజర్ సువేందు కుమార్ బెహెరా ఆమెను అభినందించారు. టర్కీలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఆమె సాధించిన భారత బాక్సర్ పతకానికి గుర్తుగా ఈ వేడుక జరిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News