- Advertisement -
ముంబయి: బాలీవుడ్ హాస్యనటుడు జగదీష్ (81) కన్నుమూశారు. కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. శుక్రవారం ముంబయిలోని షియా ఖబర్స్థాన్లో అంత్యక్రియలు జరుగుతాయి. జగదీష్కు ఇద్దరు కుమారులు ఉన్నారు. హిందీలో దాదాపుగా నాలుగు వందలలో సినిమాలలో అలరించారు. బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ షోలే సినిమాలో సూర్మ భోపాలీ పాత్రతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన మృతికి బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
- Advertisement -