Friday, March 29, 2024

న్యూజిలాండ్ మహిళా క్రికెట్ టీమ్ కు బాంబు బెదిరింపు….

- Advertisement -
- Advertisement -

Bomb threat to new zealand women cricket team

లండన్: ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న కివీస్ మహిళా జట్టుకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. బస చేసే హోటల్ నుంచి స్వదేశానికి వెళ్లేటప్పుడు విమానంలో బాంబులు పెడుతామని ఈమెయిల్ వచ్చింది. బెదిరింపులు రావడంతో భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. మహిళా క్రికెటర్లు బస చేసి హోటళ్లో ఎటువంటి బాంబులు లేవని భద్రతా సిబ్బంది తెలిపారు. దీంతో ఉత్తుత్తి బెదిరింపులేనని భద్రతా సిబ్బంది పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు తమకు తెలిపిందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. పాకిస్తాన్‌లో న్యూజిలాండ్ టీమ్ పర్యటన సందర్భంగా పురుషుల జట్టుకు కూడా బెదిరింపులు రావడంతో టోర్నీని రద్దుచేసుకున్న విషయం తెలిసిందే. పాక్‌లో తీవ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉండడంతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. వెంటనే న్యూజిలాండ్ పై పాక్ క్రికెట్ బోర్డు ఐసిసికి ఫిర్యాదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News