- Advertisement -
పెద్దపల్లి: బోర్వెల్లో పని చేసే కార్మికుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం రచ్చపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. బోర్ వేస్తుండగా ప్రమాదవశాత్తు కె. స్వామి అనే కార్మికుడు పైనుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన స్వామిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ స్వామి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Bore well worker dead in Accident in peddapalli
Bore well worker dead in Accident in peddapalli
- Advertisement -