Thursday, April 18, 2024

తల్లి ఫోన్ లాక్కుందని కొడుకు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Boy commits suicide after mom takes away phone

హైదరాబాద్: సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంటలో శనివారం దారుణం చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్లో పబ్జీ గేమ్ ఆడుతుండగా తల్లి మందలించి ఫోన్ లాగేసుకుంది. దీంతో మనస్థాపానికి గురైన 14సంవత్సరాల బాలుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కుమారుడి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

Boy commits suicide after mom takes away phone

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News