Thursday, April 25, 2024

బైక్ ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన మందుబాబు

- Advertisement -
- Advertisement -

boy dead in bike accident in bhadradri

 

భద్రాద్రి కొత్తగూడెం: అశ్వారావు పేట మండలం వినాయకపురం గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు మృత్యువాతపడ్డాడు. ఎపి రాష్ట్రం కుక్కునూరు మండలం చీరవెళ్లి గ్రామానికి చెందిన లక్ష్మణరావు మద్యం మత్తులో ఉన్నాడు. తన ఐదేళ్ల కుమారుడు రోహిత్‌తో కలిసి వినాయకపురం గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాడు. లక్ష్మణ్ తన సొంతూరుకు బైక్ పై వస్తుండగా, ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కరెంట్ స్తంభానికి ఢీకొట్టాడు. ముందు కూర్చున్న కుమారుడి తలకు బలమైన గాయం కావడంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మణ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ మధు ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News