Wednesday, April 24, 2024

తాళ్లతో బంధించి… చితకబాది… పేడ తినిపించారు… (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: తోటలోకి వచ్చి మామిడి పండ్లను దొంగతనం చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు పిల్లలను తాళ్లతో కట్టేసి వారికి పేడ తినిపించి దాడి చేసిన సంఘటన మహబూబాబాద్‌లోని తొర్రూర్ మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తొర్రూరుకు చెందిన ఇద్దరు పిల్లలు తాము పెంచుకున్న కుక్క కనిపించడం లేదని గ్రామ శివారులో ఉన్న మామిడి తోటలోకి వెళ్లారు. మామిడ కాయలను దొంగలించడానికి వచ్చారనే అనుమానంతో పిల్లలను ఇద్దరు వ్యక్తులు పట్టుకున్నారు. వారిని తాళ్లతో కట్టేసి పేడ తినిపించిన అనంతరం వారిపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పిల్లల తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధులు కలెక్టరు, ఎస్‌పి దృష్టికి తీసుకెళ్లడంతో వారిపై చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఇద్దరు వ్యక్తులు బానోతు యాకు, బానోతు రాములుగా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ నగేష్ తెలిపారు.

 

https://www.youtube.com/watch?v=4yHAlCFfHTs

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News