మహబూబాబాద్ : మహబూబాబాద్లో తొమ్మిదేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. మహబూబాబాద్కు చెందిన ఓ చానెల్ వీడియో జర్నలిస్టు కుసుమ రంజిత్ కుమారుడు దీక్షిత్ (9) ఆదివారం మిత్రులతో ఆడుకుంటుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు అతడిని కిడ్నాప్ చేశారు. పొద్దుపోయినా కూడా బాలుడు ఇంటికి రాకపోవడంతో అతడి తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికి దీక్షిత్ జాడ దొరకలేదు. దీంతో అతని తోటివారిని ఆరా తీయగా బైక్పై వచ్చిన ఓ వ్యక్తి దీక్షిత్ను తీసుకునివెళ్లాడని వారు తెలిపారు. ఇక, రాత్రి 10 గంటల ప్రాంతంలో కిడ్నాపర్లు బాలుడి తల్లికి ఫోన్ చేసి రూ. 45 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తేనే బాలుడిని విడిచిపెడతామని కిడ్నాపర్లు చెప్పారు.
ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దని హెచ్చరించారు. ఇంటి చుట్టుపక్కల తమ వ్యక్తులు ఉన్నారని మీరు ఏం చేసినా తమకు తెలుస్తుందని బాలుడి తల్లిని బెదిరించాడు. పోలీసులకు కంప్లైట్ చేయవద్దని అన్నాడు. బాలుడికి జ్వరంగా ఉందని ట్యాబ్లెట్స్ వేసి పడుకొబెట్టామని చెప్పాడు. బాబుతో మాట్లాడించమని తల్లి ఎంత వేడుకున్నా కిడ్నాపర్ కనికరించకపోగా ఫోన్ పెట్టేశాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి.. కిడ్నాప్ అయిన బాలుడి ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించాడు. బాలుడి తల్లిదండ్రులను సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. కిడ్నాపర్ల ఆచూకీ తెలుసుకునేందకు ముమ్మరంగా గాలిస్తున్నారు. అలాగే కిడ్నాప్ జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. అలాగే పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేసేందుకు ఇప్పటివరకు నాలుగుసార్లు ఫోన్ చేశారు. అయితే వారు నెట్ ఫోన్తో కాల్ చేస్తుండంతో కిడ్నాపర్ల ఆచూకీ కనుగొనడం పోలీసులకు కష్టంగా మరింది.