- Advertisement -
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
హైదరాబాద్: ప్రేమ పేరుతో యువతిని మోసం చేయడంతో బాధితురాలు వనస్థలిపురం పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం… వనస్థలిపురం, హస్తినాపురానికి చెందిన ఆకురి గీత(23) స్థానికంగా ఉన్న విఎస్ఆర్ ధాన్యం గోదాంలో పనిచేస్తున్న సమయంలో విష్ణు(25)తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమకు దారితీసింది. రెండేళ్లు ఇద్దరు ప్రేమించుకున్నారు. తనను వివాహం చేసుకోవాల్సిందిగా యువతి కోరడంతో విష్ణు నిరాకరించాడు. తక్కువ కులం దానివి అని వివాహం చేసుకునేందుకు నిరాకరించినట్లు బాధితురాలు తెలిపింది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -