కారు రూపంలో కబలించిన మృత్యువు
ప్రియురాలి ఎదుటే ప్రియుడి మృతి
చౌటుప్పల్లో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు భీభత్సం…
మూడు బైకులు, మరో కారును ఢీకొట్టిన కారు
ప్రమాదంలో ఒకరి మృతి, మరో ముగ్గురికి స్వల్ప గాయాలు
మన తెలంగాణ / చౌటుప్పల్(హైదరాబాద్) : ప్రేమజంట పెళ్లి చేసుకునేందుకు వెళుతున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి చెందిన ఘటన చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని 65 వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం నాడు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని హయత్నగర్కు చెందిన నాగరాజు, శ్రీలత ప్రేమించుకున్నారు. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ చెరువుగట్టు దేవాలయంలో పెళ్లి చేసుకునేందుకు బయలుదేరారు. ఎన్నో ఆశలతో ద్విచక్రవాహనంపై నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు దేవాలయానికి బయలుదేరారు. మూడుముళ్ల బంధంతో కాసేపట్లో ఒక్కటవ్వాలనుకున్న వారిని రోడ్డు ప్రమాదం వెంటాడింది. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యంతో దూసుకొచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. మరికొన్ని వాహనాలనూ తోసుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో నాగరాజుతోపాటు మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
ఈక్రమంలో ఆసుపత్రికి తరలిస్తుండగా. నాగరాజు మృతి చెందాడు. శ్రీలతతోపాటు మిగతవారు చికిత్స పొందుతున్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జాతీయ రహదారిపై సిగ్నల్పడింది. కొన్ని క్షణాల్లో గ్రీన్లైట్వెలిగేందుకు సమయం సమీపిస్తోంది. వాహనదారులు అందరూ అప్రమత్తంగా ఉన్నారు. కొందరు యూ టర్న్తీసుకుంటున్నారు. ప్రేమజంట ద్విచక్రవాహనం ముందున్న లారీ, కార్లు నెమ్మదిగా కదిలాయి. మిగతా వాహనాలూ ముందుకు వెళ్తున్నాయి. మెళ్లగా వేగం పెంచేందుకు ఒక్కొక్కరూ గేర్లు మారుస్తున్నారు. అంతలోనే అనుకోని ప్రమాదం కారు రూపంలో వచ్చి పడింది. హైదరాబాద్నుంచి విజయవాడ వెళ్తున్న వాహనదారుడు వెనకాల నుంచి అతివేగంతో దూసుకొచ్చాడు. ముందున్న వాహనాలను బలంగా ఢీ కొట్టాడు. ఆ వేగానికి ప్రమాదంలోనూ కారు ఆగలేదు.ఈ ఘటనలో నాగరాజు, శ్రీలత ఉన్న ద్విచక్రవాహనానికి మంటలు అంటుకున్నాయి. పెట్రోల్లీక్కావడం వల్ల మంటలు చెలరేగి వాహనం పూర్తిగా కాలిపోయింది.
ప్రమాదంతో జాతీయ రహదారిపైనున్న వాహనదారులతోపాటు స్థానికులు ఉలిక్కిపడ్డారు. కారు బ్రేకులు ఫెయిల్అవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తుండగా సిసిటివి దృశ్యాలు చూస్తే వాహనదారుడి నిర్లక్ష్యంగా కారణంగానే దుర్ఘటన చోటుచేసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. డ్రైవర్ఎక్కడా కారును నియంత్రించే ప్రయత్నం చేయలేదు. అతివేగంగా ఢీ కొట్టిన తర్వాత… కొంచెం వేగం నెమ్మదించినట్టు స్పష్టమవుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
డ్రైవర్పై కేసు నమోదు : నిర్లక్షంగా కారును నడిపి ప్రమాదానికి కారణమైన నిజామాబాద్కు చెందిన కారు యజమాని, డ్రైవర్ అయిన నారాయణ పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ సి.హెచ్.వెంకన్న తెలిపారు. ఇదిలావుండగా మృతుడు నాగరాజు శ్రీలతతో కలిసి గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. చెర్వుగట్టు జాతరలో వివాహం చేసుకునేందుకు వెళుతూ ఊహించని ఘటనతో మృత్యువాత పడ్డాడని సిఐ తెలిపారు.