Thursday, April 25, 2024

బ్రెయిన్ డెడ్ వ్యక్తి అవయవాలతో 8 మందికి ప్రాణదానం

- Advertisement -
- Advertisement -

Brain-Dead Tamil Nadu Man Gives New Lease Of Life To 8 People

కోయంబత్తూరు: ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్‌గా మారిన ఒక 51 ఏళ్ల వ్యక్తి తన అవయవాలతో ఎనిమిది మందికి ప్రాణదానం చేశారు. వృత్తిరీత్యా టైలర్ అయిన ఆర్ చెందామరై నగరంలోని సింగనల్లూరు వాసి. ఈ నెల 6న ఆయన ప్రమాదానికి గురై ఇక్కడి కెఎంసి ఆసుపత్రిలో చేరారు. ఆయనకు బ్రెయిన్ డెడ్ అయినట్లు కెఎంసి ఆసుపత్రి మంగళవారం ప్రకటించింది. ఆయన అవయవాలను దానం చేయడానికి ఆయన కుటుంబ సభ్యులు సంసిద్ధత తెలియచేయడంతో కెఎంసిహెచ్‌లోనే ఒక వ్యక్తికి చెందామరై కాలేయాన్ని, మూత్రపిండాన్ని మార్చారు. వెల్లూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక రోగికి రెండవ మూత్రపిండాన్ని అమర్చారు. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరో వ్యక్తికి గుండె మార్పిడి చేశారు. చెందామరై రెండు నేత్రాలు, చర్మం, ఎముకలను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి పంపించినట్లు కెఎంసిహెచ్ ఒక ప్రకటనలో తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News