Thursday, March 28, 2024

పెళ్లైన 20 రోజులకే నవ వధువు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Bride commit suicide in kurnool

కర్నూలు: నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పార్లపల్లి గ్రామంలో మాదన్న-నయోమి దంపతులకు అనురాధ అనే కూతురు ఉంది. ఆమె ఆ గ్రామంలో వలంటీర్‌గా పని చేస్తోంది. దగ్గరి బంధువు ఎమ్మిగనూరు పట్టణ వాసి కిరణ్ తో మే 24న అనురాధ పెళ్లి జరిగింది. పెళ్లైన వారం రోజుల తరువాత వలంటీర్‌గా పని చేసేందుకు అనురాధ పార్లపల్లికి వచ్చింది. తల్లిదండ్రులు చర్చికి వెళ్లినప్పుడు ఆమె ఇంట్లోనే ఉరేసుకుంది. ఇంటికి తిరిగొచ్చిన తల్లిదండ్రులకు ఫ్యాన్‌కు కూతురు వెలాడుతూ కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు. ఆమె పలుమార్లు కడుపు నొప్పి వచ్చిందని, ఆ బాధతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ సునీల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News