Thursday, April 25, 2024

కాబోయే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి

- Advertisement -
- Advertisement -

Bride dead in road accident in Mancherial

మనతెలంగాణ/కాసిపేట:  కాబోయే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలో జరిగింది. దీంతో పెండ్లి ఇంట్లో విషాదాచాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవాపూర్ గ్రామనికి చెందిన పుప్పాల రాంప్రసాద్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో మైన్స్‌లు సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. జనవరి 3వ తేదీన వివాహం ఉండడంతో డిసెంబర్31వ తేదీన మంచిర్యాలకు వెళ్లి దేవాపూర్‌కు తిరిగి వస్తున్న నేపథ్యంలో కాసిపేట గని సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఐదు రోజుల పాటు చికిత్స పొందుతు చివరికి శ్వాస విడిచాడు. రాంప్రసాద్ మృతికి సంతాపంగా మంగళవారం ఓరియంట్ సిమెంట్ కంపెనీలో మైన్స్ కార్మికులు సంతాపంగా మూడు షిప్టులను బంద్ పెట్టారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో పాడే ఎక్కడంతో ప్రతి ఒక్కరి హృదయాలను కలచి వేశాయి. దీంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News