Saturday, April 20, 2024

పెళ్లైన రెండు రోజులకే నవ వధువు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Bride groom commit suicide in Yadadri bhongir

 

యాదాద్రి భువనగిరి: పెళ్లైన రెండు రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం మర్రిబావితండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం పెద్దవూరతండాకు చెందిన యువకుడితో అనుషకు(21) పెళ్లి జరిగింది. 27న వరుడి ఇంట్లో వివాహం జరగడంతో అక్కడే విందు ఏర్పాటు చేశారు. అదే రోజు తన పుట్టింటికి మర్రిబావి తండాకు వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం తన గదిలోకి వెళ్లి గడియా వేసుకోని పడుకుంది. పెళ్లి అలసటతో నిద్ర వస్తుందోమోనని అందరూ భావించారు. తలుపులు ఎంతకు తెరవకపోవడంతో బంధువులు వాటిని విరగ్గొటి చూడగా ఉరేసుకొని కనిపించింది. కాళ్లకు పారాణి ఆరక ముందే వధువు తనువు చాలించిందని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు. మర్రిబావితండాలో విషాదచాయలు అలుముకున్నాయి. గ్రామస్థుల సమాచారం మేరకు ఎస్‌ఐ సుధాకర్ రావు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News