Friday, March 29, 2024

పైళ్లైన ఐదు రోజులకే నవ వధువు మృతి

- Advertisement -
- Advertisement -

 

నాగర్ కర్నూల్: పెళ్లైన ఐదు రోజులకే నవ వధువు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. తాండూరు ప్రాంతానికి చెందిన నవీన్‌తో(26), శ్రీవాణి(19) మే 14న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుకలు అంగరంగా వైభవంగా జరిగాయి. బుధవారం ఉదయం దంపతులిద్దరూ దేవాలయంలో అభిషేకం చేసుకొని ఇంటికి వచ్చారు. నూతన వధువు వాంతులు చేసుకోవడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. కరోనాతో ఆమె మృతి చెందిందని స్థానికులు ఆరోపణలు చేశారు. కానీ ఆమె మాత్రం కరోనాతో చనిపోలేదని వైద్యులు వెల్లడించారు. పారాణి ఆరకముందే నవవధువు చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News