Thursday, March 28, 2024

భర్తకు అన్నం పెట్టి… నవ వధువు అదృశ్యం….

- Advertisement -
- Advertisement -

Bride missing in Ananthapuram

అమరావతి: పెళ్లైనా పది రోజులకే నవ వధువు అదృశ్యమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా డోన్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… డోన్ మండలం మల్కాపురం గ్రామానికి చెందిన మాధవి అనే యువతికి, యాడికి మండలం పిన్నెపల్లి గ్రామానికి చెందిన కొత్త రాయుడితో ఈ నెల 10న పెళ్లి జరిగింది. వివాహం అనంతరం వధువు, వరుడు తిరిగింపు, మరిగింపులో భాగంగా ఈ నెల 19వ తేదీన చిన్నమల్కాపురం గ్రామానికి చేరుకున్నారు. మాధవి తన భర్తకు అన్నం వడ్డించి అంగడికి వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లింది. భార్య తిరిగిరాకపోవడంతో భార్య కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఆమె బంధువుల, స్నేహితులకు ఫోన్ చేసిన సమాచారంలేకపోవడంతో వరుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News