- Advertisement -
న్యూఢిల్లీ: కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంధనం తక్కువగా ఉండటంతో శనివారం రాత్రి బ్రిటిష్ ఎఫ్-35 యుద్ధ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. యుద్ధ విమానం విమాన వాహక నౌక నుండి బయలుదేరి రాత్రి 9.30 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానాశ్రయ అధికారులు సజావుగా, సురక్షితంగా ల్యాండింగ్ అయ్యేలా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. తక్కువ ఇంధనం ఉందని.. ల్యాండ్ చేయడానికి అనుమతి ఇవ్వాలని పైలట్ కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం విమానం విమానాశ్రయంలోనే నిలిపి ఉంచామని.. సంబంధిత కేంద్ర ప్రభుత్వ అధికారులు అవసరమైన అనుమతి మంజూరు చేసిన తర్వాత ఇంధనం నింపడం జరుగుతుందని వర్గాలు తెలిపాయి.
- Advertisement -