వికారాబాద్: ప్రేమించిన మరదలు తనకు దక్కదనే ఉద్దేశంతో బావి దగ్గర చెట్టుకు ఉరేసుకొని బావ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా తాండూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుంతబాసుపల్లి గ్రామంలో సర్వ శాంతుకుమార్ అనే యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. కుమార్ తన మేనత్త కూతురుతో ప్రేమలో పడ్డాడు. వారం రోజుల నుంచి అమ్మాయి కనిపించకపోవడంతో అమ్మాయి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి శాంతకుమార్, అమ్మాయి ఒకే దగ్గర ఉన్నట్టు గుర్తించారు. ప్రేమ జంటను పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. మరుసటి రోజు నుంచి అమ్మాయి కనిపించకపోవడంతో మళ్లీ శాంతకుమార్ ఆమె కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో తనకు మరదకు దక్కదని మనస్థాపానికి గురయ్యాడు. వెంటనే బావి దగ్గరకు వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.