Friday, March 29, 2024

అనుమానం….. మరదలి ప్రాణం తీసిన బావ

- Advertisement -
- Advertisement -

Brother in law killed sister in law over love

 

హైదరాబాద్: మరదలిపై అనుమానంతో ఆమెను గొంతునులిమి బావ హత్య చేసిన సంఘటన మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. సోమేశ్వర రావు ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ మూసాపేటలో నివసిస్తున్నాడు. బతుకుదెరువు కోసం శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌కువ వచ్చాడు. అదే జిల్లాకు చెందిన భూపతి (21) బిటెక్ సెకండియర్‌లో చదువు ఆపేసిన అనంతరం కూకట్‌పల్లిలో నివసిస్తున్నాడు. సోమేశ్వర్ రావుకు మంజుల(19) అనే కుమార్తె ఉంది. మంజులకు భూపతి వరసకు బావ అవుతాడు. ఇద్దరు ఒకరికి ఒకరు తెలుసుకోవడంతో ప్రేమించుకుంటున్నారు. మంజుల గత కొన్ని రోజుల నుంచి మరో వ్యక్తితో చనువుగా ఉండడంతో ఆమెపై భూపతి అనుమానం పెంచుకున్నాడు. గత శనివారం భూపతి తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లడంతో తన మరదలకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని కబురు పంపాడు. మంజలపై ఉన్న అనుమానాన్ని బయటపెట్టడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. అదే సమయంలో భూపతి ఎవరిని అనుమానిస్తున్నాడో ఆ యువకుడు మంజలకు ఫోన్ చేయడంతో అతడు కోపంతో ఊగిపోయాడు. దీంతో మంజుల గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని నీటి సంపులో పడేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ధైర్యం సరిపోకపోవడంతో వెంటనే వెనక్కి తగ్గాడు. అనంతరం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని నీటి సంపులో నుంచి బయటకు తీశారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మంజులపై అనుమానమే ఆమె ప్రాణం తీసిందని పోలీసులు విచారణలో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News