Friday, March 29, 2024

అక్రమ సంబంధం పెట్టుకుందని సొంత సోదరినే చంపేశారు..

- Advertisement -
- Advertisement -

 

ముజఫర్‌నగర్: వేరే మతానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కారణంతో తమ వితంతు సోదరిని ఆమె సొంత సోదరులే గొంతు పిసికి చంపి, గుట్టుచప్పుడు కాకుండా మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ దారుణ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఇటీవల చోటుచేసుకుంది. మృతురాలి సోదరులు సుమీత్ కుమార్, సోనులను న్యూ మండీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మృతురాలి ప్రియుడు జుల్ఫీకర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. జుల్ఫికర్ కథనం ప్రకారం రెండేళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయిన ఆమెతో అతనికి ప్రేమ ఏర్పడింది. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె సోదరులు ఆమెను గొంతు పిసికి చంపివేశారు. ఆమె మరణం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆమె శవానికి అంత్యక్రియలు జరిపించారు.

Brothers killed widowed sister and cremated her, Two brothers killed their own sister for having affair with a man from other religion
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News