Friday, March 29, 2024

లండన్ లో మొట్టమొదటి బిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

లండన్ : ఇటీవల అధికారికంగా టి.ఆర్.ఎస్ పార్టీ బి.ఆర్.ఎస్ గా మారిన సందర్భంగా అధ్యక్షులు,సిఎం కెసిఆర్ కు, నాయకులకు, కార్యకర్తలకు ఎన్నారై బి.ఆర్.ఎస్ యుకె అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి శుభాకాంక్షలు తెలిపారు. నాడు ఉద్యమ సమయంలో ఖండాతరాల్లో మొట్టమొదటి గులాబీ ఉద్యమ జెండాను లండన్ లో ఎగరేసి సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్ర సాధన కోసం నడిచామని, అదే స్పూర్తితో నేడు దేశంలో గుణాత్మక మార్పు కోసం ఏర్పాటు చేసిన బి.ఆర్.ఎస్ పార్టీ మొట్టమొదటి జెండాను సైతం లండన్ లోని చారిత్రాత్మక టవర్ బ్రిడ్జి వద్ద ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉందని అశోక్ తెలిపారు. నేడు తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం దేశమంతా అమలు కావాలంటే అది కేవలం కెసిఆర్ నాయకత్వంతోనే సాధ్యమని ఎన్నారైలంతా విశ్వసిస్తున్నారని, ఎన్నారైలంతా కెసిఆర్ వెంటే ఉన్నారని అశోక్ గౌడ్ స్పష్టం చేశారు.

యుకెలో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాసులంతా బి.ఆర్.యస్ పార్టీ లో చేరి కెసిఆర్ నాయకత్వంలో పని చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారని, వారందరిని ఆహ్వానిస్తూ, అలాగే భారత్ నుంచి బి.ఆర్.ఎస్ నాయకులని ఆహ్వానించి త్వరలో ఘనంగా బి.ఆర్.యస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్ని నిర్వహిస్తమని అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ చందుగౌడ్ తెలిపారు. “దేశ్ కి నేత కెసిఆర్” “అబ్ కి బార్ కిసాన్ సర్కార్” నినాదాలతో లండన్ టవర్ బ్రిడ్జి ప్రాంతం మారుమోగింది. కెసిఆర్ ప్రతీ పిలుపుకి స్పందించి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామని ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి తెలిపారు. మైళ్ళ దూరంలో ఉన్నా నాడు టి.ఆర్.ఎస్ ఉద్యమ జెండా, నేడు దేశ గతిని మార్చే మరో ఉద్యమ బి.ఆర్. ఎస్ జెండా మోసే అవకాశాన్ని కల్పించిన అధ్యక్షులు కెసిఆర్, కెటిఆర్ కు కార్యదర్శి సత్య చిలుముల ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ చందుగౌడ్ సీక, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, కార్యదర్శులు హరి గౌడ్ నవాబుపేట్, సత్య చిలుముల, శ్రీకాంత్ జెల్ల, కోశాధికారి సతీష్ గొట్టెముక్కుల, అధికార ప్రతినిధులు రవిప్రదీప్ పులుసు, రవి రేతనేని, లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి, కోర్ కమిటీ సభ్యులు అబ్దుల్ జాఫర్, పృద్వీ రావుల, మధు యాదవ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News