Friday, March 29, 2024

జేపీ నడ్డాను అడ్డుకున్న బిఆర్ఎస్ నాయకులు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: ఈరోజు కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ వద్ద బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి రూపాయి నిధులు ఇవ్వకుండా తెలంగాణ ప్రజల పట్ల  వివక్షను చూపుతున్న బిజెపి ప్రభుత్వ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారిని గో బ్యాక్ నడ్డా అంటూ ప్లకార్డులతో అడ్డుకున్నారు. కొత్త బిచ్చగాళ్లు పొద్దు ఎరగనట్టు గా తెలంగాణ మీద రాబంధుల్లా వస్తున్నారు అని నిరసన తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు దూలం సంపత్ గౌడ్,పెండ్యాల మహేష్ కుమార్,సాయి ఠాకూర్ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News