- Advertisement -
దౌల్తాబాద్ : వికారాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ మండలం బాలంపేట్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనుమానం పెనుభూతమై ఇద్దరి ప్రాణాలు తీసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య హాజీ బేగం(30)పై అనుమానంతో ఉన్మాదిగా మారిన భర్త ఆమె పాలిట కాలయముడయ్యాడు. కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. భార్యాభర్తలు తరుచూ గొడవ పడేవారు సోమవారం కూడా అదే తంతు మళ్లీ జరిగింది. గొడవను ఆపడానికి వెళ్లిన మామ గపూర్ సాబ్(65)ను కత్తితో పొడిచి చంపాడు. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఖలీద్ ను అరెస్ట్ చేశారు. అనంరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Brutal Murder of Two Persons At Vikarabad District
- Advertisement -