Friday, March 29, 2024

యువకుడి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Brutal murder of young man in Peddapalli

 

పెద్దపల్లి: గర్తుతెలియని వ్యక్తుల దాడిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయైన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మద్దిరాల గ్రామశివారులో సందేల రమేష్ ట్రాక్టర్ తో పొలం దున్నుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి మూకుమ్మడిగా కత్తులతో దాడి చేశారు. తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికి మెడ, తల భాగంలో తీవ్ర గాయాలు కావడంతో పొలంలోనే రమేష్ మృతిచెందాడు. మృతుడిది జగిత్యాల జిల్లా ధర్మారం మండలం నందిమేడారం. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని పెద్దపల్లి డిసిపి రవీందర్, గోదావరిఖని వన్ టౌన్ సిఐ రమేష్, అంతర్గాం ఎస్సై శ్రీధర్ పరిశీలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News