భువనేశ్వర్: బిఎస్ఎఫ్ జావాన్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళపై అత్యాచారం చేసిన సంఘటన మధ్యప్రదేశ్లో భువనేశ్వర్లో జరిగింది. జవాన్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఒడిశాలోని జగట్ సింగ్ పూర జిల్లా చాసిఖంద్ గ్రామానికి చెందిన బిఎస్ఎఫ్ జవాను ఖోర్ధా జిల్లాలోని బడతోటాలో విధులు నిర్వహిస్తున్నాడు. ఓ మహిళ అదే ప్రాంతంలో ఓ రియల్ ఎస్టేట్ ఎజెంట్ వద్ద పని చేస్తోంది. 2017లో రియల్ స్టేట్ వ్యాపారి నుంచి సదరు జవాన్ ప్లాట్ను కొనుగోలు చేసినప్పుడు మహిళతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించి లొబరుచుకున్నాడు. వాళ్లు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆమెకు తెలియకుండా దృశ్యాలను చిత్రీకరించాడు. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చడంతో ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోనని జవాన్ చెప్పడంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి సదరు జవాన్ను అరెస్టు చేశారు. నిందితుడిని పలు పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.