- Advertisement -
హైదరాబాద్: నగరంలోని లంగర్ హౌస్ ప్రశాంత్ నగర్ కాలనీలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ఓ బిటెక్ విద్యార్థి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని విజయ్(21)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అసలు విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.
BTech student commits suicide by hanging
- Advertisement -