లక్నో: ఇంజనీరింగ్ విద్యార్థిని కత్తులతో పొడిచి హత్య చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రశాంత్ సింగ్ అనే బిటెక్ విద్యార్థి (23) తన స్నేహితుడిని కలిసేందుకు కారులో గోమతి నగర్ వెళ్తున్నాడు. మధ్యలో 10 మంది యువకులు కారు వెంబడించి కత్తులతో దాడి చేశారు. స్నేహితుడి ఇళ్లు రాగానే వాళ్ల నుంచి తప్పించుకొని వెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ నడి రోడ్డుపై యువకులు కత్తులతో అతడి కడుపు, ఛాతీలో పొడిచారు. వాళ్ల నుంచి తప్పించుకొని స్నేహితుడి ఇంట్లోకి పారిపోయాడు. స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇచ్చి స్థానికుల సహాయంతో ప్రశాంత్ ను ఆస్పత్రికి తరలించారు. వైద్యశాలలో ప్రశాంత్ చికిత్స పొందుతూ చనిపోయాడు. గతంలో స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలో జరిగిన గొడవ కారణంగానే ప్రశాంత్ను జూనియర్లు హత్య చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Btech Student Murder by his Juniors in Uttarpradesh