Friday, April 19, 2024

రాని అంబులెన్స్… గేదె మృతి

- Advertisement -
- Advertisement -

Buffalo dead with sick in kamareddy

మన తెలంగాణ/రాజంపేట: అంబులెన్సు సకాలంలో రాకపోవడంతో గేదె మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట  మండలంలోని పొందుర్తి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గొల్ల శ్రీనివాస్ అనే రైతుకు చెందిన గేదెకు అకస్మాత్తుగా అనారోగ్యం బారినపడింది. వెంటనే ఆదివారం మధ్యాహ్నం 12.00 గం॥ల ప్రాంతంలో 1962 నెంబర్  ఫోన్ చేశారు. ఆంబులెన్స్ రాదు అని ఏదైనా సమస్య ఉంటే సోమవారం ఉదయం 7, 8 గంటల ప్రాంతంలో ఫోన్ చేయాలని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చినట్లు గొల్ల శ్రీనివాస్ తెలిపారు. 12.40 గంటలకు సంబంధిత వైద్యులు అక్కడికి చేరుకున్నప్పటికి అప్పటికే గేదె మరణించిందన్నారు. అంబులెన్స్ రాకపోవడం వల్లనే తన గేదె చనిపోయిందని బోరున విలపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News