టివి యాంకర్గా బుల్లితెర ప్రేక్షకులను మురిపిస్తున్న అనసూయ సినిమాల్లోనూ నటిస్తూ వెండితెర ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. రామ్చరణ్, సుకుమార్ – కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా అందరినీ మెప్పించింది. ఈ సినిమాతో అనసూయ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. క్షణం,- ఎఫ్2, – సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇటీవల విజయ్ దేవరకొండ నిర్మించిన ’మీకుమాత్రమే చెప్తా’ సినిమాలో కీలక పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు అనసూయ ఒక బంపర్ ఆఫర్ దక్కించుకుందట. అది కూడా ఏకం గా మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులేసే ఛాన్స్ దక్కించుకుందని తెలిసింది. చిరంజీవి 152వ మూవీ గా తెరకెక్కుతున్న ’ఆచార్య’ సినిమా లో ఒక ఐటమ్ సాంగ్ కోసం అనసూయని సంప్రదించారట. ఇంతకుముందు ‘విన్నర్’ సినిమాలో సాయిధరమ్ తేజ్తో ఆడిపాడిన ఈ బ్యూటీ ఇప్పుడు చిరుతో స్టెప్పులేసే ఛాన్స్ కొట్టేసిందని అంద రూ అనుకుంటున్నారు. దీనిపై త్వరలో స్పష్టత రానుంది.