Friday, April 26, 2024

చివరి టెస్టుకు బుమ్రా దూరం!

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: వరుస గాయాలతో సతమతమవుతున్న టీమిండియాకు మరో కోలుకోలేని షాక్ తగిలింది. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న స్టార్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా జట్టుకు దూరమయ్యాడు. చివరి టెస్టులో బుమ్రా బరిలోకి దిగడం లేదని బిసిసిఐకి చెందిన ఓ అధికారి వెల్లడించాడు. ఇప్పటికే జడేజా, విహారిలు కూడా గాయంతో చివరి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా బుమ్రా కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఇంతకుముందే షమి, ఉమేశ్ యాదవ్‌లు సిరీస్ నుంచి వైదొలిగారు. తాజాగా బుమ్రా కూడా దూరం కావడంతో జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన బుమ్రా కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. మూడో టెస్టులో బుమ్రాకు ఈ సమస్య ఎదురైంది. నొప్పితోనే అతను బౌలింగ్‌ను కొనసాగించాడు. అయితే, నొప్పి మరింత తిరగబడడంతో బుమ్రాను జట్టు నుంచి తొలగించారు. అతని స్థానంలో యువ బౌలర్ నటరాజన్‌కు జట్టులో తీసుకున్నారు.

Bumrah Ruled Out ahead of Brisbane Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News