Thursday, April 25, 2024

క్రికెట్ కోచ్‌గా లాస్య ఎంపికపై హర్షం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి కేంద్రానికి చెందిన బుర్ర లాస్య తెలంగాణ నుంచి తొలి మహిళా క్రికెట్ కోచ్‌గా ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) దేశంలో ఎంపికచేసిన ముగ్గురు క్రీడాకారుల్లో లాస్య ఒకరు. బాల్యం నుంచే లాస్యకు క్రికెట్ ఎంతో ఆసక్తి. ఈక్రమంలో క్రికెట్‌లో మెలకువలపై హైదరాబాద్ లో శిక్షణ తీసుకున్నారు. అనంతరం ఐసీసీ నిర్వహించే మొదటి శ్రేణి శిక్షణ కోర్సును పూర్తి చేసుకున్నారు. దుబాయ్‌లో ఐసిసి అకాడమీ కోచ్ ఎడ్యుకేషన్ కోర్సు లెవెల్ వన్‌ను పూర్తి చేశారు.

ఈ కోర్సులో ఉత్తీర్ణత సాధించి కోచ్ గా ఎదిగారు. శనివారం తన తండ్రి రమేష్ తో కలిసి రాష్ట్ర క్రీడల శాఖ. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆమెను అభినందించి రాష్ట్రం గర్వించేలా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. లాస్య తల్లి సునీత జాతీయ అథ్లెట్, ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా యువజన, క్రీడల అధికారిణిగా, వాలీబాల్ క్రీడాకారుడైన తండ్రి రమేష్ ప్రస్తుతం జిల్లా గ్రంథా లయాల సంస్థ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. క్రికెట్లో మెరుగైన శిక్షణ ఇస్తూ ఉత్తమ క్రికెటర్లను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని లాస్య తెలిపారు. లాస్య ఎంపిక పట్ల జిల్లా క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News