Saturday, April 20, 2024

పంట పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

- Advertisement -
- Advertisement -

Bus accident in vikarabad

వికారాబాద్: ఆర్టీసీ బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లిన సంఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం గంగ్వార్ వద్ద జరిగింది. తాండూర్ నుంచి జీవన్గి ప్రాంతానికి వెళ్తుండగా బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కండక్టర్ తో సహా మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో లక్ష్మమ్మ అనే మహిళ కాలు విరిగినట్టు సమాచారం. బస్సులో 27 ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఇదే బస్సుకు ఈ వారంలో రెండో ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపాడు. డ్రైవర్ చాకచక్యంగా వ్యహరించడంతోనే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డామని ప్రయాణికులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News