Friday, April 26, 2024

బ‌స్సు బోల్తా: 16 మందికి తీవ్రగాయాలు

- Advertisement -
- Advertisement -

bus carrying 45 overturns on Lucknow-Agra Expressway

ఇటావా: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఇటావాలో గురువారం ఓ బ‌స్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ హైవేపై తెల్ల‌వారుజామున 3.30గంట‌ల‌కు చోటుచేసుంది. ఢిల్లీ నుంచి బీహార్ కు వెళ్తుండగా బస్సు బోల్తా పడినట్టు బాధితులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలు కాగా.. అందులో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఇటావాలోని పిజిఐ సైఫై ఆస్పత్రికి త‌ర‌లించారు. ప్ర‌థ‌మ చికిత్స అనంత‌రం 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో మొత్తం 45 మంది ఉన్నట్టు ఇటావా ఎస్ఎస్పీ ఆకాశ్ తోమ‌ర్ పేర్కొన్నారు.

bus carrying 45 overturns on Lucknow-Agra Expressway

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News