Thursday, April 25, 2024

నాగ్ పూర్-పూణె హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

పుణె: నాగ్ పూర్-పూణె హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం మహారాష్ట్రలోని బుల్ఢానా జిల్లాలో చోటుచేసుకుంది.

పుణె నుంచి మెహెకర్ వెళ్తున్న బస్సును నాగ్ పూర్-పూణె హైవేపై ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News