Friday, March 29, 2024

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసి డ్రైవర్ కు గాయాలు

- Advertisement -
- Advertisement -


మన తెలంగాణ/తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో గురువారం తెల్లవారుజామున లారీ, బస్సు ఢీకొన్న ఘటనలో ఆర్టీసీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంథని డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు బుధవారం రాత్రి దాదాపు 11గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బయలుదేరింది. గురువారం తెల్లవారుజామున దాదాపు 1.30గంటల సమయంలో తిమ్మాపూర్‌కు చేరుకోగానే ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది. లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో బస్సు స్పీడ్ కంట్రోల్ కాక లారీని ఢీ కొట్టిందని బస్సు డ్రైవర్ తెలిపాడు. లారీకి ఇండికేటర్స్ సరిగ్గా లేకపోవడం, లారీ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగే ప్రమాదానికి కారణమని పేర్కొంటూ పోలీసులకు బస్సు డ్రైవర్ ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News