Thursday, April 25, 2024

ఆర్టీసి బస్సుకు కరెంట్ షాక్…. మెకానిక్ మృతి

- Advertisement -
- Advertisement -

Bus mechanic dead with current shock

మన తెలంగాణ/నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం గోపతండ గ్రామ శివారులో సోమవారం బస్సు కరెంట్ షాక్ తగలడంలో మెకానిక్ మృతి చెందాడు. ఖమ్మం డిపోకి చెందిన ఆర్టీసి బస్సు వరంగల్ నుండి ఖమ్మం వెళ్తున్న క్రమంలో బ్రేక్ డౌన్ కావడంతో బస్సు దగ్గరికి చేరుకున్న ఆర్టీసీ మెకానిక్ శ్రీనివాస్ రిపేర్ చేస్తున్న క్రమంలో  రోడ్డు ప్రక్కన నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంక్‌లో బస్సు రివర్స్ తీస్తున్న క్రమంలో డ్రైవర్ పైన ఉన్న 11 కెవి కరెంట్ వైర్లను గమనించకుండా వెళ్లడంతో బస్సుకి వైర్లు తగిలి ఒక్క సారిగా టైర్లకు మంటలు అంటుకోవడంతో ఏమైందో ఆర్థంకాని మెకానిక్ టైర్‌ని ముట్టుకోవడంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ లావుడ్య నరేష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని ఆర్టీసి ఆధికారులకు సమాచారం అందించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News