Wednesday, April 24, 2024

చెరువులో బోల్తాపడిన బస్సు…

- Advertisement -
- Advertisement -

Bus roll over in prakasham

అమరావతి: ఆర్‌టిసి బస్సు చెరువులోకి దూసుకెళ్లిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నాగిరెడ్డిపాలెం శివారులో చెరువు కట్ట పైనుంచి బస్సు వెళ్తుండగా అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో బోల్తాపడింది. చేపలు పడుతున్న మత్స్యకారులు ఘటనా స్థలంలో ఉండడంతో బస్సులో నుంచి ప్రయణికులను బయటకు తీశారు. స్వల్పంగా గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 28 మంది ప్రయాణికులతో కందుకూరు నుంచి కనిగిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆర్‌టిసి అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు ప్రమాదంపై ఆరా తీస్తున్నామని ఆర్‌టిసి అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News