ఢిల్లీ: ప్రియురాలి పెళ్లికి అడ్డుచెప్పినందుకు కాబోయే భర్త, తల్లితో కలిసి ప్రియుడ్ని హత్య చేసిన సంఘటన ఢిల్లీలోని ఆదర్శ్ నగర్లో జరిగింది. మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి రైళ్లో నుంచి బయటపడేశారు. ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నీరజ్ గుప్తా అనే వ్యాపారి గత పది సంవత్సరాల నుంచి ఫైసల్తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఫైసల్కు జుబెర్తో పెళ్లి చేయాలని ఆమె తల్లి షాహిన్ నాజ్ నిర్ణయం తీసుకుంది. ఫైసల్ తన ప్రియుడు గుప్తాకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు ఉంటున్న ఇంటికి వచ్చాడు. నవంబర్ 13న ఫైసల్, గుప్తా మధ్య గొడవ జరుగుతుండగా జుబెర్ అడ్డురావడంతో పక్కకు నెట్టేశాడు. జుబెర్ ఇటుకతో గుప్తా తలపై బలంగా కొట్టడంతో కిందపడిపోయాడు. వెంటనే ఫైసల్, షాహిన్ సహాయంతో గుప్తాను జుబెర్ కత్తితో పలుమార్లు పొడిచి హత్య చేశాడు. శవాన్ని సూట్ కేసులో పెట్టి గుజరాత్ వెళ్తున్న రైళ్లో నుంచి భరూచ్ ప్రాంతంలో బయటపడేశారు. గుప్తా కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో అతడి భార్య ఫిర్యాదు చేయడంతో ఫైసల్ పై అనుమానం ఉందని తెలిపింది. పోలీసులు వెంటనే ఫైసల్ను అదుపులోకి తనదైన శైలిలో ప్రశ్నించడంతో తామే హత్యచేశామని ఒప్పుకుంది. ఫైసల్ గుప్తా ఆఫీస్లో పని చేసేదని, ఇద్దరు అంగీకారంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని గుప్తా భార్య పోలీసులకు తెలిపింది.
కాబోయే భర్తతో కలిసి ప్రియుడ్ని చంపిన ప్రియురాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -