- Advertisement -
భద్రాద్రి కొత్తగూడెం: గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం అంబేద్కర్ సెంటర్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎస్ఐ మహేష్ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎపి36ఎస్7677 నంబర్ గల వాహనంలో 180 కిలోల గంజాయి దొరికింది. వెంటనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దాదాపుగా ఈ గంజాయి విలువ రూ. 27 లక్షల విలువ ఉంటుందని పోలీసులు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించామని ఎస్ఐ తెలిపాడు.
- Advertisement -