- Advertisement -
హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండల కేంద్రంలోని బస్ స్టాప్ ముందు సోమవారం ఉదయం కారు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ మద్యం మత్తులో నడుపుతూ డివైడర్ ను ఢీ కొట్టడంతో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వాహనదారుడిని ఆదిత్య ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. వాహనదారుడు మద్యంమత్తులో వాహనాన్ని వేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.
- Advertisement -